దౌల్తాబాద్ ఆగస్టు :మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం లక్ష్యాన్నిసాధించాలని ఎంపీడీఓ తిరుమలస్వామి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేషించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటి పెంచాలన్నారు.
అలాగే రోడ్డు ఇరువైపుల మొక్కలు నాటే విధంగా చూడాలని, చాలా గ్రామాల్లో మొక్కలు నాటి వదిలివేశారని వాటికి ట్రీగార్డ్ష్స్ ఏర్పాటు చేసి వాటి సంరక్షించాలని సూచించారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారుశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.