వికారాబాద్: జిల్లాలోని పరిగి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఆమె మొక్కలు నాటారు.
మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాల సంతోషంగా ఉన్నదని విద్యార్థులు, ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సీతారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సతీమణి ప్రతిమ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, స్థానిక జెడ్పీటీసీ పట్లొల హరి ప్రియ, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ మధుసూదన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.