రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం విద్యుద్దీపకాంతులతో జిగేల్మంటోంది. తెలంగాణలోనే అతిపెద్ద శైవక్షేత్రం, దక్షిణకాశీగా ఖ్యాతిగాంచిన వేములవాడలో మహాశివరాత్రి జాతర అత్యంత వైభవంగా జరుగనుంది. ఇక్కడ జరిగే ఉత్సవానికి తెలంగాణ జిల్లాల నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన చత్తీస్గఢ్, మహారాష్ట్ర , ఒడిశా నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. జాతర కోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లును ముమ్మరంగా చేపట్టింది. మహాశివరాత్రికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఆలయ ఈవో, వేములవాడ ఎమ్మెల్యే మాటల్లోనే విందాం రండి..