Dhoop Sticks | | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాల్లో తీరొక్క పూలతో స్వామిని సింగారిస్తారు. పుష్పం సమర్పయామి.. అంటూ భక్తితో నివేదిస్తారు. మరుసటి రోజు మళ్లీ ఓ కొత్తదండ మూలమూర్తిని చేరుతుంది. వాడిపోయిన పూదండలు సేకరించి, ఎండబెట్టి.. అగర్బత్తీలు తయారు చేస్తున్నది వాగ్మి. యాదాద్రి గోశాల నుంచి సేకరించిన ఆవు పేడను కలిపి.. పరిమళాలు వెదజల్లే ఆర్గానిక్ అగరబత్తీలను రూపొందిస్తున్నది. ఆవు పేడను కలిపి ఆర్గానిక్ ధూప్స్టిక్స్ను వాగ్మి ఎలా తయారు చేస్తున్నది? వాటికోసం ఎలాంటి పద్ధతులు వాడుతున్నది? ఇంకా ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నది వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ కింది వీడియో చూసేయండి.