తెలంగాణ ఉద్యమ గొంతుక మూగబోయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తన ఆటపాటతో ఊపిరిలూదిన ఊపిరి ఆగిపోయింది. హోరెత్తించే పాటలతో ఉద్యమకారులను ఏకం చేసిన పాట ఆగిపోయింది. మలిదశ ఉద్యమం నుంచి తెలంగాణ ప్రగతి పరుగుల దాకా తోడున్న గళం.. సెలవంటూ వెళ్లిపోయింది. ఉడుకు నెత్తురు.. ఉద్యమ స్ఫూర్తి.. ఉప్పొంగిన గేయం సాయిచంద్.. మనల్ని వదిలి దివంగత లోకాలకు వెళ్లిపోయాడు. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ హఠాన్మరణం చెందాడు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్హౌస్కు వెళ్లాడు. అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ సాయిచంద్ కన్నుమూశాడు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
ఇదీ సాయిచంద్ ఉద్యమ ప్రస్థానం..వీడియో