తెలంగాణ ఏర్పాటుకు ముందు సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నంతో భోజనం చేయలేక విద్యార్థులు అవస్థలుపడేవారు. కొందరు విద్యార్థులు ఉపవాసంతో పాఠశాలకు వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్ని పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం వచ్చేసింది. సంక్షేమ వసతి గృహాల్లోనూ నాణ్యమైన భోజనం అందుబాటులోకి వచ్చింది. అయితే, ఓ నియోజకవర్గం పరిధిలోని పాఠశాలల్లో చాలా మంది నిరుపేద విద్యార్థులే చదువుకుంటారు. ఉదయం వాళ్లు టిఫిన్ చేయకుండానే బడికి వస్తున్న విషయాన్ని అక్కడి మంత్రి ప్రత్యక్షంగా గమనించారు. కొన్ని సంస్థలతో కలిసి విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.. మరి అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.