పెట్రోల్, డీజిల్ రేట్లు మండి పోతున్నాయి. నెలకు సరాసరి నాలుగు వేల రూపాయలు పెట్రోల్కే ఖర్చవుతున్నాయి. దీంతో సామాన్యుడు ఆల్టర్నేటివ్ వైపు అడుగులు వేస్తున్నాడు. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వేహికిల్ వైపు చూస్తున్నాడు. విద్యుత్ వాహనాలకు డిమాండు పెరుగుతున్నది.
మార్కెట్లో రకరకాల బ్రాండ్లకు సంబంధించి ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు లభిస్తున్నాయి. ధరను బట్టి బండి ఫీచర్లు ఉంటున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం ఏథర్, హీరో, బజాజ్ వంటి టాప్ బ్రాండ్ కంపెనీల టూవీలర్లు దొరుకుతున్నాయి. ఏథర్ ఈవీ టూవీలర్ ఫీచర్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి