న్యూఢిల్లీ : ఇంటర్నెట్ను షేక్ చేస్తూ తరచూ వినూత్న కంటెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ మహిళ పది రూపాయల నోటుపై ప్రియుడికి రాసిన మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తన పెండ్లి ఖరారైందని తనను ఎక్కడికైనా తీసుకువెళ్లాలని కరెన్సీ నోటుపై ప్రియుడితో ఆమె రాయబారాలు నడిపింది.
విపుల్ అనే యూజర్ ఈ ఇమేజ్ను ట్విట్టర్లో షేర్ చేయగా ఇది ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రూ 10 నోటుపై కుసుమ్ అనే మహిళ విశాల్కు మెసేజ్ రాసుకొచ్చింది. విశాల్..ఏప్రిల్ 26న నా పెండ్లి జరుగుతోంది..ప్లీజ్ నన్ను నీతో తీసుకెళ్లు..ఐ లవ్యూ..యువర్స్ కుసుమ్ అంటూ ఆ నోటుపై రాసింది.
విశాల్కు ఈ మెసేజ్ చేరాలని ఆశిస్తూ విపుల్ అనే యూజర్ ఈ ఇమేజ్ను షేర్ చేశాడు. ట్విట్టర్ నీ సత్తా చాటి నీకు తెలిసిన విశాల్లందరికీ ట్యాగ్ చేయమని ఈ పోస్ట్కు విపుల్ క్యాప్షన్ ఇచ్చాడు. ట్విట్టర్లో వైరలవుతున్న ఈ పిక్పై నెటిజన్లు తలో రకంగా స్పందించారు. ఈ పోస్ట్కు ఇప్పటివరకూ 400కు పైగా లైక్లు వచ్చాయి.