ఇప్పుడు కాదు.. కొన్ని వందలు.. వేల ఏళ్ల నుంచి ఆ ప్రశ్న.. ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఆ ప్రశ్నేంటో ఇప్పటికే మీరు అర్థం అయిపోయి ఉంటుంది. కోడి ముందా? గుడ్డు ముందా? అనే ప్రశ్నను ఇప్పటి వరకు మనం చాలాసార్లు విని ఉంటాం. దానికి సమాధానం మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. చిన్నపిల్లలను అడిగినా కూడా దానికి సమాధానం చెప్పలేరు. కానీ.. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఏదో.. గెస్సింగ్ ఆన్సర్ అనుకునేరు. వందశాతం పక్కా ఆన్సర్ దొరికేసింది. సైంటిస్టులే నిరూపించారు.
కోడి ముందా? గుడ్డు ముందా? అనేది ఒక ప్రశ్న అనేకన్నా.. దాన్ని ఒక వాదనగా పరిగణించవచ్చు. ఎందుకంటే.. కోడి ముందు.. అని చెప్పామనుకోండి.. గుడ్డులో నుంచే కదా కోడి వచ్చేది. గుడ్డు లేకుండా కోడి ముందు ఎలా వచ్చింది అంటారు. లేదు గుడ్డు ముందు అన్నామనుకోండి. గుడ్డును పెట్టేది కోడే కదా.. మరి కోడి లేకుండా గుడ్డు ఎలా ముందు వచ్చింది అంటారు.
దీనికి సరైన సమాధానం కనుక్కునేందుకు.. దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు చాలామంది పరిశోధకులు ఏళ్లకు ఏళ్లు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. చివరకు కొందరు సైంటిస్టులు మాత్రం ఆ చిక్కుముడిని విప్పేశారు.
గుడ్డే ముందు అనేది సైంటిస్టులు ఎలా నిరూపించారో తెలుసా? దాన్ని ఒక ఉదాహరణతో వివరించారు. ఉదాహరణకు.. ఒక ఏనుగు గుడ్డు పెట్టింది అనుకోండి. ఆ గుడ్డులో నుంచి సింహం పిల్ల బయటికి వచ్చింది అనుకోండి. అప్పుడు దాన్ని ఏ గుడ్డు అంటాం. ఏనుగు గుడ్డు అంటామా? లేక సింహం గుడ్డు అంటామా? ఇక్కడ రెండు వేర్వేరు జాతులకు చెందిన జీవుల పునరుత్పత్తి వల్ల ఉద్భవించిన గుడ్డు అది. వాటికి పుట్టిన బిడ్డలో ఎవరి డీఎన్ఏ ఉంటుంది. వంద శాతం ఏ జీవి డీఎన్ఏ కూడా ఉండదు.
దీన్నే మ్యుటేషన్ లేదా పరివర్తనం అంటాం. అంటే కొత్త జాతి ఉద్భవించడం అన్నమాట. గుడ్డులో ఉండే సెల్స్ ద్వారా ఈ మ్యుటేషన్ జరుగుతుంది.
అంటే.. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం.. ఈ భూమ్మీద కోడిని పోలిన భారీ పక్షులు ఉండేవట. ఆ పక్షులు పెట్టిన గుడ్డు నుంచి కోడి లాంటి కొత్త జాతి ఉత్పత్తి అయిందట. రాను రాను.. జన్యు మార్పిడి చోటు చేసుకొని.. ప్రస్తుతం మనం చూస్తున్న కోళ్లలా తయారయ్యాయట. అంటే.. ఆ భారీ పక్షులు పెట్టిన గుడ్ల వల్ల.. కోళ్లు పుట్టాయి. అవి.. తరాలు మారుతున్నా కొద్దీ జన్యు మార్పిడి వల్ల.. ఇలా మారాయన్నమాట. అంటే గుడ్డే ముందు కదా. ఆ గుడ్డు నుంచి వచ్చిన కోడే ఇప్పుడు మనం చూస్తున్న కోళ్లు.. అంటూ సైంటిస్టులు ఓ జర్నల్లో ప్రచురించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bull : ఈ ఎద్దు విలువ రూ. కోటి.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆ బామ్మ వయసు 105 ఏళ్లు.. అయినా పరుగుపందెంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది
ఆ ఐలాండ్లో మహిళలదే రాజ్యం.. వాళ్లదే పైచేయి.. మరి పురుషులు ఏం చేస్తారు?
Dwarfs : ఆ ఊళ్లో సగం మంది మరుగుజ్జులే.. కారణం ఏంటో తెలుసా?