డెహ్రాడూన్: దేశంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తరాదిలోని హిమాలయాల సమీప రాష్ట్రాల్లో తీవ్రంగా మంచు కురుస్తున్నది. దాంతో అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయ పరిసరాల్లో విపరీతంగా మంచుకురిసింది. ఎంతలా ఏకంగా వర్షం పడినట్లే మంచుపడింది. దాంతో ఆలయం ఆవరణలోని మెట్లు, బహిరంగ ప్రదేశం, ఆలయ గోపురాలపై మంచుగడ్డలు పేరుకుపోయాయి.
ఈ మంచువర్షం స్థానికులను చలికి గడగడలాడేలా చేస్తున్నా.. మంచు కురుస్తున్న దృశ్యాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి..