ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి గతేడాది ‘మానికే మాగే హితే’ అనే శ్రీలంక పాటపై చేసిన డ్యాన్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, కృతిసనన్ నర్తించిన హిట్ పాట ‘పరమ్ సుందరి’పై డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఈ వీడియోకూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో మీనాక్షి క్యాబిన్ సిబ్బందితో కలిసి యూనిఫాంలో ‘పరమ్ సుందరి’ పాటపై డ్యాన్స్ ఇరగదీసింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటపై ఎయిర్హోస్టెస్ డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోను 2.3లక్షల మంది వీక్షించారు.