ఓ వ్యక్తికి రెండురోజులు దవాఖానలో ఉన్నందుకు రూ. 52.63 లక్షల బిల్లు వేశారు హాస్పిటల్ యాజమాన్యం. అందులో ఎక్స్రేకు చాలా పెద్ద మొత్తంలో వసూలు చేశారు. ఎక్స్రేకు ఇంత ఖర్చవుతుందా? ఆ ఖర్చులోనే తాను ఎక్స్ర్ యంత్రాన్ని తయారుచేస్తానని శపథం పూనాడు. యూట్యూబ్లో చూసి ఎక్స్రే యంత్రాన్ని తయారుచేసి చూపించాడు. ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతోంది.
యూట్యూబర్ విల్ ఉస్మాన్ అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. రెండోరోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన దవాఖాన యాజమాన్యం అతడికి 69,00 డాలర్లు (రూ. 52.63 లక్షలు) బిల్ చేతికిచ్చింది. ఎక్స్రే, యాంటీబయాటిక్స్తో కూడిన చికిత్సకు ఈ మొత్తం వసూలు చేశారు. ఇన్సూరెన్స్ ఉండడంతో బతికిపోయాడు. ఇన్సూరెన్స్ పోనూ రూ. 2,500 డాలర్లు చెల్లించాడు. దవాఖాననుంచి ఇంటిరాగానే ఎక్స్రే యంత్రం తయారుచేయాలని నిశ్చయించుకున్నాడు. రూ. 2000 ఖర్చుతో ఎక్స్రే మిషన్ను తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.