Viral News | మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కుమార్తెను ఏకంగా శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అత్యంత ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.
గ్వాలియర్ జిల్లా మొహానా గ్రామానికి చెందిన వ్యాపారవేత్త శిశుపాల్ రాథోర్కు సోనాల్ అనే కుమార్తె ఉంది. అయితే సోనాల్ 26ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆమె మాట్లాడలేదు, వినలేదు కూడా. సోనాల్ తోటి అమ్మాయిలందరికీ పెళ్లిళ్లు అవుతుండటంతో.. శిశుపాల్ కూడా తన కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్నాడు. అయితే ఆమె దివ్యాంగురాలు కావడంతో పెళ్లి చేయడం కష్టంగా మారింది. దీంతో శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో బంధుమిత్రులకు ఫోన్ చేసి తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడితో వివాహం అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అయినా తన కుమార్తెకు ఓ ఆలయంలో ఎంతో ఘనంగా పెళ్లి జరిపించాడు. మెహందీ వేడుక, విందు, ఊరేగింపు కూడా నిర్వహించాడు. ఈ పెళ్లి తంతులో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న అమ్మాయి, వధువు పూలదండలు మార్చుకున్నారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు వారిని ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Man fulfills terminally sick daughter’s wish, marries her to #LordKrishna in #Gwalior with fanfare. During the #marriage all #rituals were followed, watchhttps://t.co/SIICIKukNr#MadhyaPradesh #Viral #News #Krishna pic.twitter.com/cl4CqPfaax
— Free Press Journal (@fpjindia) November 10, 2022