Saiyami Kher : బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. గాయంతో బాధపడుతూనే కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుని గెలిపించేందుకు చివరి బంతి వరకు పోరాడాడు. టీమిండియా ఓటమిపై చాలామంది విమర్శలు గుప్పించారు. అయితే.. బాలీవుడ్ నటి సయామీ ఖేర్ జట్టు ఓటమికి విపరీతమై క్రికెట్ కారణం అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘నేను ఎప్పుడు ఇలా అనలేదు. భారత జట్టు చాలా ఎక్కువ క్రికెట్ ఆడుతోంది. దానివల్ల మ్యాచ్లో మజా ఉండడం లేదు. టీ 20 వరల్డ్ కప్ అయిపోయి కొన్ని రోజులైనా కాలేదు. అంతలోనే న్యూజిలాండ్ సిరీస్. ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటన. వచ్చే ఏడాది స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్. ఆ వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్. క్రికెట్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూసిన రోజులను మిస్ అవుతున్నా’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో చాలామంది ఆమె చెప్పింది నిజమే అంటున్నారు.
సయామీ ఖేర్ క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు తాను ఒకప్పుడు క్రికెట్ ప్లేయర్ కూడా. ఆమె స్కూల్ డేస్లో మహారాష్ట్ర తరఫున క్రికెట్ ఆడింది. అంతేకాదు జాతీయ జట్టుకి కూడా ఎంపికైంది. అయితే, ఆ టైమ్లో బ్యాడ్మింటన్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు మొదలయ్యాయి. దాంతో, ఆ పోటీల్లో పాల్గొనేందుకు ఆమె క్రికెట్ను వదిలేసింది. ఆమె ప్రస్తుతం ఫాదూః ఏ లవ్ స్టోరీ వెబ్సిరీస్లో నటిస్తోంది. ఈ సిరీస్ సోని లివ్ ఛానెల్లో డిసెంబర్ 9వ తేదీ నుంచి లైవ్ స్ట్రీమింగ్ కానుంది.
I didn’t think I would ever say this. But the Indian team is just playing way too much cricket. It’s killing the excitement. We barely finished the WC & the NZ series started now the Ban series than SL, NZ, AUS, IPL! I miss the days when we actually looked forward to a series!
— Saiyami Kher (@SaiyamiKher) December 8, 2022