న్యూఢిల్లీ: డైమండ్స్ అంటేనే ఖరీదైనవి. వాటి విలువ లక్షలు మొదలు కోట్ల వరకు ఉంటుంది. తాజాగా కోట్ల రూపాయల విలువ చేసే ఒక బ్లాక్ డైమండ్ను సౌదీ ఆరేబియాలోని దుబాయ్లో ప్రజా సందర్శన కోసం పెట్టారు. దాదాపు 20 ఏండ్ల క్రితం ఒక పేరు బయట పెట్టని వ్యక్తి నుంచి సేకరించిన ఈ డైమండ్ను బయటికి తీయడం ఇదే తొలిసారి. సోతెబై (Sotheby) అనే వేలం సంస్థ సోమవారం ఈ డైమండ్ను పబ్లిక్ డిస్ప్లే కోసం బయటపెట్టింది.
ప్రపంచంలోని కట్ డైమండ్లలో ఇదే అతిపెద్ద డైమండని, ఈ డైమండ్ క్యారట్ విలువ 555.55 అని దాన్ని వేలం వేయనున్న సోథిబై సంస్థ తెలిపింది. ఎనిగ్మాగా పిలువబడే ఈ డైమండ్ దాదాపు 260 కోట్ల సంవత్సరాల క్రితం ఉల్క లేదా ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టడం ద్వారా ఏర్పడి ఉంటుందని సోతిబై ఆక్షన్ హౌస్కు చెందిన జ్యుయెలరీ స్పెషలిస్ట్ సోఫీ స్టీవెన్స్ చెప్పారు. ఈ అరుదైన్ బ్లాక్ డైమండ్కు 55 ముఖాలు ఉన్నట్లు స్టీవెన్ తెలిపారు.
ఈ అరుదైన వజ్రం అతిపెద్ద కట్ డైమండ్గా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి కూడా ఎక్కిందని స్టీవెన్ చెప్పారు. దుబాయ్లో ప్రదర్శన అనంతరం ఈ డైమండ్ను లాస్ ఏంజిల్స్, లండన్కు తీసుకుకెళ్లి ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత వేలం వేయనున్నారు. ఫిబ్రవరి 3న ఈ డైమండ్ వేలం ప్రారంభవం కానున్నదని సోతిబై ఆక్షన్ హౌస్ వెల్లడించింది. ఈ వేలానికి క్రిప్టో కరెన్సీని కూడా అనుమతించే అవకాశం ఉంది. వేలంలో ఈ డైమండ్ రూ.50 కోట్లకుపైనే ధర పలుకవచ్చని సోతిబై అంచనా వేస్తున్నది.