ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో.. ఎవరి అదృష్టం ఎక్కడ ఉందో అస్సలు ఊహించలేం. ఏదో టైమ్ పాస్కు చేసిన పనులే ఒక్కోసారి ఫేమస్ అవుతాయి. ఈ మధ్య మీమ్స్ బాగా ఫేమస్ అవుతున్న విషయం తెలిసిందే. మీమ్స్ను ఎక్కువగా ట్రోలింగ్ కోసం.. సరదా కోసం వాడుతుంటారు. కానీ.. ఏదో సరదా కోసం చేసిన మీమ్సే ఒక్కోసారి ట్రెండ్ సృష్టిస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా సరదాగా క్రియేట్ చేసిన ఓ మీమ్.. 38 లక్షలకు అమ్ముడుపోయింది. షాక్ అయ్యారు కదా. అవును.. ఇది నిజం. ఇంతకీ ఏంటి ఆ మీమ్.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి.
పాకిస్థాన్లోని గుజ్రన్వాలాకు చెందిన ఆసిఫ్ రాజాకు, తన బెస్ట్ ఫ్రెండ్ ముదసిర్ ఇస్మాయిల్ అహ్మద్తో గొడవ జరిగి.. ఇద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనుకున్నాడు ఆసిఫ్. దీంతో మీమ్ లాంటి ఒక ఫోటోను తయారు చేశాడు. అందులో.. నా బెస్ట్ ఫ్రెండ్ ముదసిర్ ఇస్మాయిల్ను నేను వదిలేశాను. ఇప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ సల్మాన్ అహ్మద్ నక్వష్ అని రాసి.. ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ముదసిర్తో ఫ్రెండ్షిప్ ఎండ్ అయింది.
ఇప్పుడు సల్మాన్ నా బెస్ట్ ఫ్రెండ్.. అంటూ తన కొత్త బెస్ట్ ఫ్రెండ్తో దిగిన ఫోటోను పెట్టి.. తన పాత ఫ్రెండ్ ఫోటోలను కింద పెట్టి.. వాటికి క్రాస్ మార్క్ పెట్టి.. ఒక మీమ్లా క్రియేట్ చేశాడు. నిజానికి.. ఈ పోస్ట్ పెట్టింది 2015లో. కానీ.. ఈ మీమ్.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు.. ఎన్ఎఫ్టీ వేలంలో 38 లక్షలు పలికింది. ఇటీవలే ఈ మీమ్ను 38 లక్షలకు ఫ్రెండ్షిప్ డే రోజున అమ్మేశారు. ఇక.. ఈ మీమ్ వల్ల ఆసిఫ్ లక్షాధికారి అవ్వడంతో పాటు.. ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడ తెగ ఫేమస్ అయిపోయారు. మీడియా ప్రతినిధులు వచ్చి వాళ్లను ఇంటర్వ్యూ కూడా తీసుకోవడంతో వాళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.