శ్రీరామనవమిని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీబీచ్లో రామాలయం వెలిసింది. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో ఆరు ఫీట్ల పొడవైన రామమందిర ప్రతిరూపాన్ని రూపొందించారు. దానిపై రాముడి విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆరు ఫీట్ల పొడువులో ఆయోధ్య రామాలయ ప్రతిరూపాన్ని ఇసుకతో రూపొందించాను. అయోధ్య రామాలయ నిర్మాణం త్వరగా పూర్తికావాలని ప్రార్థిస్తున్నా.’ అని సుదర్శన్ పట్నాయక్ పేర్కొన్నారు. సుదర్శన్ పట్నాయక్.. అయోధ్య రామాలయ భూమిపూజ రోజునకూడా ఒడిశా బీచ్లో రామాలయ ప్రతిరూపాన్ని రూపొందించారు. అయోధ్యలోనే ఈ రామమందిర ప్రతిరూపాన్ని రూపొందించాలనుకున్నా కొవిడ్ -19వల్ల వీలు కాలేదని, అందుకు పూరీ బీచ్లో నిర్మించానని చెప్పారు.
Odisha | On the eve of Ram Navami, a sand artist created Ayodhya’s Ram temple using sand, in Puri
I have made an idol of Lord Ram along with a miniature of Ayodhya’s Ram temple, its height is 6 feet. I pray the temple is built soon: Sudarshan Patnaik, sand artist (09.04) pic.twitter.com/BdTJSEygke
— ANI (@ANI) April 10, 2022