లక్నో : ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను పొరుగుంటి వారు రూ.లక్ష విక్రయించారంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి చేసిన ఆరోపణలు అబద్ధాలేనని, భార్యపై కోపంతోనే ఇలా చేశాడని తేల్చారు. ఆ వ్యక్తి భార్య చదువుకున్నదని, ఆమె స్వయంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని గుర్తించారు.
ఈ ఘటన ముజఫర్నగర్ జిల్లా జనసత్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. అయితే, పోలీసుల సమయాన్ని వృథా చేయడంతో పాటు తప్పుదారి పట్టించేందుకు యత్నించినందుకు ఫిర్యాదుదారుడితో పాటు పొరుగింటి వ్యక్తి సైతం పోలీసులు జరిమానా విధించారు. అంతకు సదరు వ్యక్తి ఠాణాలో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పొరుగువారితో గొడవకు దిగాడు. నా భార్య చాలా అందంగా ఉంటుందని, చదువుకున్నది కాబట్టే పొరుగింటి వారు డబ్బులకు అమ్మేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.