న్యూఢిల్లీ: మృగరాజు తోక ముడిచింది. కర్రతో ఉన్న వ్యక్తిని చూసి భయంతో పరుగెత్తింది. ‘యానిమల్స్ పవర్స్’ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అటవీ ప్రాంతంలో ఒక మగ సింహం ఉంటుంది. కాగా, ఒక వ్యక్తి ఒంటరిగా అక్కడికి వెళ్లాడు. సింహాన్ని చూసి కోపంగా చేతిలోని కర్రతో దాన్ని భయపెట్టాడు. అయితే అది దాడి చేయకపోగా కర్ర చూపిన వ్యక్తిని చూసి భయపడింది. ఆ ఒంటరి వ్యక్తి కర్రతో వెంటపడగా అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది.
‘మనిషిని చూసి సింహం భయపడింది’ అన్న శీర్షికతో ‘యానిమల్స్ పవర్స్’ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు ఎనిమిది లక్షల మంది దీనిని చూశారు. 54 వేలకుపైగా లైక్ చేశారు. మనిషిని చూసి సింహం భయపడటంపై నెజిటన్లు షాకయ్యారు. ఆ వ్యక్తికి చివరి కోరిక ఏదో మిగిలి ఉందని, అందుకే సింహం అతడిపై దాడి చేసి తినేయకుండా వదిలేసిందని ఒకరు చమత్కరించారు. కాగా, ఆ వ్యక్తి కర్రతో సింహాన్ని బెదిరించడాన్ని కొందరు తప్పుపట్టారు.