భువనేశ్వర్: వేసవి కాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో కొందరు ఎంచక్కా వంటకు ఎండనే ఉపయోగిస్తున్నారు. ఒడిశాకు చెందిన ఒక మహిళ ఏకంగా బయట ఎండలో ఉన్న కారు బానెట్పైనే చపాతీలు తయారు చేసింది. నీలమాధబ్ పాండా అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘నా పట్టణం సోనేపూర్లోని దృశ్యాలు. ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఎవరైనా కార్ బానెట్పై రోటీ చేయవచ్చు’ అని పేర్కొన్నారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మణిపూర్కు చెందిన ‘వాతావరణ కార్యకర్త’ లిసిప్రియా కంగుజం ఈ వీడియోపై స్పందించారు. ‘భారతదేశానికి అభినందనలు. మనం కార్ బానెట్పై కూడా రోటీని తయారు చేయవచ్చు’ అని ఎద్దేవా చేశారు. కొందరు నెటిజన్లు కూడా తమదైన స్టైల్లో స్పందించారు.
ప్రస్తుతం ప్రజలు చెట్లకు ఎలాంటి విలువ ఇవ్వడం లేదని, ఈ వీడియోలో కూడా ఒక చెట్టైనా కనిపించడం లేదని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. బయట విపరీతమైన ఎండలు ఉన్నాయని, అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నందున పిల్లలను ఎండలోకి పంపవద్దని సూచించారు. మనం రోడ్లను ఏసీ చేయలేకపోయినా చెట్లను నాటవచ్చన్నారు. చెట్లను కాపాడాలని, మరిన్ని చెట్లు నాటాలని హితవుపలికారు. సోలార్ ఎనర్జీ భవిష్యత్తు ఇంధనమని మరొకరు పేర్కొన్నారు.
Scenes from my town Sonepur. It’s so hot that one can make roti on the car Bonnet 😓 @NEWS7Odia #heatwaveinindia #Heatwave #Odisha pic.twitter.com/E2nwUwJ1Ub
— NILAMADHAB PANDA ନୀଳମାଧବ ପଣ୍ଡା (@nilamadhabpanda) April 25, 2022
Congratulations India!
Finally we can make roti on car bonnet.#Heatwave #ClimateCrisis pic.twitter.com/uVu5Nqas8t— Licypriya Kangujam (@LicypriyaK) April 25, 2022