దేశంతో సంబంధం లేకుండా ప్రతిచోటా అక్కడి పరిస్థితులకు తగ్గట్టు మూఢనమ్మకాలు ఉంటాయి. జపాన్లో కూడా అంతే. ఇక్కడ ఇప్పుడు పెద్ద హాట్టాపిక్గా మారిన అంశం ఒక బండరాయి. జపాన్లోని నాసు ప్రాంతంలో ఉండే ఈ రాయి పేరు సెష్షో-సెకి. ఈ రాయిని ఎవరైనా తాకితే చనిపోతారని ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం.
జపాన్ పురాణాల ప్రకారం దుష్టశక్తి అయిన 9 తోకల నక్క ఆత్మను బంధించారని స్థానికులు నమ్ముతారు. పురాతన కాలంలో ఈ నక్క ఒక అందగత్తె రూపంలో వచ్చి చక్రవర్తిని చంపడానికి ప్రయత్నించిదట. అప్పుడు దాన్ని ఓడించిన వాళ్లు ఆ దుష్టశక్తిని ఈ రాయిలో బంధించారనేది దీని బ్యాక్స్టోరీ. 1957లో ఈ ప్రాంతాన్ని చారిత్రక ప్రదేశంగా గుర్తించిన ప్రభుత్వం.. టూరిస్టు స్పాట్గా దీన్ని అభివృద్ధి చేసింది.
ఈ క్రమంలోనే దీన్ని చూడటానికి ఆదివారం వెళ్లిన వారికి రెండు ముక్కలై కనిపించిందీ రాయి. అంతే అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. ‘‘ఈరోజు చూడకూడని విషయం చూశాను’’ అంటూ ఒక వ్యక్తి ఈ రాయి ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నారు. దీంతో నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
‘‘వెయ్యి సంవత్సరాల తర్వాత ఆ రాక్షసి బయటకు వచ్చేసి, పారిపోయినట్లుంది’’ అంటున్నారు. అయితే ఆ రాయిపై అంతకుముందే చీలికలు ఉన్నాయని, చలి కారణంగా అవి పెద్దవయ్యి రాయి పగిలిపోయిందని కొందరు అంటున్నారు.
九尾の狐の伝説が残る、殺生石にひとりでやってきました。
縄でぐるっと巻かれた真ん中の大きな岩がそれ…
のはずなのですが、なんと岩は真っ二つに割れて、縄も外れていました。
漫画だったらまさに封印が解かれて九尾の狐に取り憑かれるパターンで、見てはいけないものを見てしまった気がします。 pic.twitter.com/wwkb0lGOM9
— Lillian (@Lily0727K) March 5, 2022