పాట్నా: వరద నీటి ప్రవాహంతో ఉప్పొంగిన గంగా నదిలో ఒక ఏనుగు మూడు కిలోమీటర్లు ఈదింది. నిండా మునిగిన ఆ ఏనుగుపై మావటివాడు కూడా ఉన్నాడు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘవ్పూర్లో ఈ సంఘటన జరిగింది. వర్షా కాలం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నది. దీంతో కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లోని గంగా నది కూడా పరవళ్లు తొక్కుతున్నది.
కాగా, ఒక ఏనుగు, దానిపై ఉన్న మావటివాడు వరద ప్రవాహం వల్ల గంగా నదిలో కొంత దూరం కొట్టుకుపోయారు. అయితే తల వరకు మునిగిన ఆ ఏనుగు నదిలో పూర్తిగా మునిగిపోకుండా సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది. ఏనుగుపై ఉన్న మావటివాడు దానిని నది ఒడ్డుకు చేర్చేందుకు చాలా ప్రయత్నించాడు.
చివరకు ఒక చోట నది మలుపులో కొందరు వ్యక్తులు ఉండటాన్ని మావటివాడు చూశాడు. ఆ దిశగా ఏనుగు ఈదేలా చేశాడు. దీంతో ఏనుగు, మావటివాడు నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బీహార్కు చెందిన ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శభాష్ అంటూ ఆ ఏనుగు ధైర్య సాహసాన్ని నెటిజన్లు కొనియాడారు.
An Elephant and Mahaut braved the swollen river Ganga for 3 kilometers to save their lives in Raghopur of Vaishali district.
उफनते पानी से हाथी और महावत की जंग, तस्वीरें बिहार के राघोपुर की हैं. #Bihar #flood #vaishali #elephant #ganga #Rescue pic.twitter.com/dLsIuipcOz
— The Tall Indian (@BihariBaba1008) July 13, 2022