అతిగా మద్యం తాగితే.. కొందరు ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తారు. మద్యం మత్తులో గాయి గాయి చేస్తారు. తాజాగా మద్యం మత్తులో ఓ ఇద్దరు వ్యక్తులు చేసిన హడావుడి కూడా మామూలుగా లేదు.
ఇద్దరు వ్యక్తులు ఫుల్లుగా మద్యం తాగారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలోనే రోడ్డు పక్కన డ్రెయిన్ దగ్గర సగం కాలిన చనిపోయిన పాము కనిపించింది. అయితే.. ఆ పామును చూసి.. అది బతికే ఉంది అని అనుకున్నారు ఇద్దరు. అది ఇళ్లలోకి వెళ్తే ఎవరినైనా కాటేస్తుందని ఇద్దరూ అనుకొని.. దాన్ని చేతులతో తీసి.. తినేశారు. అయితే.. అది అప్పటికే చనిపోయిందని.. సగం కాలిపోయిందనే విషయం కూడా తెలియకుండా వాళ్లు దాన్ని తినేశారు.
ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని కోర్బాలో చోటు చేసుకుంది. అప్పటికే కొందరు స్థానికులు.. ఆ పామును చంపి.. కాల్చేశారు. కానీ.. అది పూర్తిగా కాలలేదు. దీంతో సగం కాలిన పామును తీసుకెళ్లి.. డ్రెయిన్ దగ్గర పడేశారు. కానీ.. ఇదేమీ తెలియని మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు రాజు, హితేంద్ర.. ఆ పామును పట్టుకొని తిన్నారు. అప్పటికే సగం కాలి ఉండగా.. అందులో సగం పామును ఇద్దరూ కలిసి తినేశారు. ఆ తర్వాత పామును విసిరేశారు.
అయితే.. పామును తినగానే.. వాళ్లకు కళ్లు తిరిగినట్టు అయి.. తిన్నది అంతా అక్కడే కక్కేశారు. ఆ తర్వాత వాళ్లు సొమ్మసిల్లి పడిపోవడంతో.. వారిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
అది విషపూరితమైన కట్ల పాము. అది కరిచిన 15 నిమిషాల్లో మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అది చనిపోయినా.. దాని విషం అందులో ఉండటంతో వాళ్లు కూడా ప్రమాదంలో పడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Beer Boy : ఇలాంటి బీర్ బాయ్ ఉంటే.. ప్రతి పెళ్లి పండుగే.. వైరల్ వీడియో
Bald Fest : అక్కడికి బట్టతల ఉంటేనే ఎంట్రీ.. బట్టతల ఫెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే?