అమరావతి : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేయడం పట్ల టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. హత్య వార్త తెలుసుకున్న చంద్రబాబు గుండ్లపాడుకు వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. రాత్రి జరిగిన అంతిమయాత్రలో పాల్గొని చంద్రయ్య పాడెను స్వయంగా మోసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ తరుఫున రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
చంద్రబాబు మాట్లాడుతూ .. హత్య రాజకీయాలకు పాల్పడేవారిని క్షమించేది లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గుండాయిజాన్ని ఎదురించాలని కోరారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల అణిచివేతకు పాల్పడితే ఏ ఒక్కరూ కూడా మిగిలేవారు కాదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలను చూసి పోలీసులు మౌనంగా ఉండడం సిగ్గుచేటని అన్నారు.