శ్రీనగర్: నిండుగా ప్రయాణికులున్న బస్సును డ్రైవర్ ఒక బాలికతో డ్రైవ్ చేయించాడు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో బస్సును స్వాధీనం చేసుకుని ఆ డ్రైవర్పై చర్యలు చేపట్టారు. జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉధంపూర్-లాండర్ మార్గంలో ప్రయాణిస్తున్న బస్సును డ్రైవర్ ప్రభుత్వ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న బాలికతో నడిపించాడు. డ్రైవర్ పక్కనే సీటులో కూర్చొన్న ఆమెకు బస్సును ఎలా డ్రైవ్ చేయాలో చెప్పాడు. దీంతో ఆ బాలిక స్టీరింగ్ను పట్టుకుని బస్సును నడిపింది. ఆ బస్సు విద్యార్థులతోపాటు ఇతర ప్రయాణికులతో నిండుగా ఉన్నది. పైగా అది కొండ మార్గంలో ప్రయాణిస్తున్నది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా బస్సు లోయలోకి దూసుకెళ్లి అందులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉంది. అయినప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బాలికతో బస్సును నడిపించాడు.
కాగా, ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డు చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జమ్ముకశ్మీర్ ట్రాన్స్పోర్ట్ అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో అధికారులు వెంటనే స్పందించారు. బాలిక డ్రైవ్ చేసిన జేకే14జీ-2734 నంబర్ బస్సును సీజ్ చేశారు. ఆ డ్రైవర్పైనా అధికారులు చర్యలు చేపట్టారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్, వాహనం పర్మిట్ను సస్పెండ్ చేశారు. ఈ నిర్లక్ష్యంపై ప్రశ్నించేందుకు ఆ డ్రైవర్కు నోటీసులు జారీ చేశారు.
అలాగే ఎలాంటి పత్రాలు లేకుండా అదే రూట్లో ప్రయాణిస్తున్న మరో వాహనాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. మోటార్ వాహన యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, డ్రైవర్ బాలికతో బస్సును నడిపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#ViralVideo of negligent #driving: Careless driver lets a girl student drive a #bus full of passengers in J&K's #Udhampur. The license & permit of the driver has now been suspended for endangering lives of passengers. pic.twitter.com/AtdeBWQw4C
— India.com (@indiacom) April 18, 2022