Anand Mahindra | పసికూన జింబాబ్వేపై టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన పోరులో జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. ఇప్పటికే సెమీస్లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న టీమిండియా.. 8 పాయింట్లతో గ్రూప్-2లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఫైనల్స్పై పడింది. ఈ పొట్టి ప్రపంచకప్లో ఫైనల్స్లో ఎవరు నిలుస్తారా అన్న ఆసక్తి నెలకొంది.
తాజాగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సైతం టీ20 ప్రపంచకప్ ఫైనల్స్పై ఆసక్తి కనబరిచారు. ఈ మేరకు కుక్కకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను ట్విట్టర్లో పోస్టుచేశారు. ‘భవిష్యత్తును పరిశీలించి టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్స్లో ఎవరు ఉంటారో చెప్పమని నేను ఈ కుక్కను అడిగా.. ఇది వర్తమానం చూసేందుకు తెలివిగా ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఇంతకీ అది చూసింది ఏంటి అని మీరు అనుకుంటున్నారా..?’ అంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
I asked this pooch to look into the future and tell me who would be in the finals of the #T20WorldCup2022 It figured out this ingenious way to look over the ‘wall’ of the present. What do you think it saw? 😊 pic.twitter.com/a5H5OPRiVU
— anand mahindra (@anandmahindra) November 6, 2022