మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో తరుచూ మోటివేషనల్ వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇటీవల చేపలు పట్టే బాలుడి వీడియోను పోస్ట్ చేశారు. అంకితభావం, సింప్లిసిటీ, ఓపిక ఉంటే విజయం సాధించొచ్చనేందుకు ఈ వీడియో ఉదాహరణ అని చెప్పారు. ‘ఈ వీడియో నాకు ఇన్స్టాలో వచ్చింది. ఈ సంక్లిష్ట ప్రపంచంలో ఇలాంటి వీడియోలు మనకు వింతగా, ప్రశాంతంగా అనిపిస్తాయి. దృఢ సంకల్పం + చాతుర్యం + ఓర్పు = విజయం అని నిరూపించే చిన్న కథనం ఇది’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
ఈ వీడియోలో బాలుడు చెరువు ఒడ్డున ఒక చక్రం ఉన్న యంత్రాన్ని బిగిస్తాడు. ఆ చక్రానికి ఉన్న గాలానికి ఇంట్లో తయారుచేసిన పిండిని అంటిస్తాడు. ఆ గాలాన్ని నీటిలో వదులుతాడు. అక్కడే ఓపిగ్గా ఎదురుచూస్తాడు. చేపలు పడగానే యంత్రం సాయంతో గాలాన్ని లాగగా, రెండు భారీ చేపలు పడతాయి. వాటిని సంతోషంగా సంచిలో వేసుకుని అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియోకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు కూడా ఆ బాలుడి అంకితభావాన్ని, స్మార్ట్ వర్క్ను మెచ్చుకున్నారు.
This showed up in my inbox without commentary. It is strangely calming to watch in an increasingly complex world. A ‘short story’ that proves: Determination + Ingenuity + Patience = Success pic.twitter.com/fuIcrMUOIN
— anand mahindra (@anandmahindra) April 1, 2022