కుక్క విశ్వాస జంతువు. మనిషిపై అమితమైన ప్రేమను చూపిస్తుంది. అందుకే చాలామంది కుక్కలను పెంచుకుంటారు. వాటిని విడిచి ఒక్కరోజుకూడా ఉండలేరు. 11ఏళ్లు తనతో ఉండి చనిపోయిన కుక్కను ఓ వృద్ధుడు కూడా మరువలేకపోయాడు. దాని రూపం ఎప్పుడూ కళ్లముందే ఉండాలని కుక్క పాలరాతి విగ్రహం తయారుచేయించి, పొలం వద్ద ప్రతిష్టించాడు.
తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లా మనమదురైకి చెందిన 82 ఏళ్ల ముత్తు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. అతడు 2010 నుంచి టామ్ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. ముత్తు ఆ కుక్కను విడిచి ఒక్కరోజుకూడా ఉండేవాడు కాదు. కాగా, ఆ కుక్క 2021లో చనిపోయింది. కానీ, ముత్తు..టామ్ను మరువలేకపోపోయాడు. రూ. 80వేలు వెచ్చించి పాలరాతి విగ్రహం తయారుచేయించాడు. తన పొలం వద్ద ప్రతిష్టించాడు. టామ్ గుర్తుకొచ్చినప్పుడల్లా వెళ్లి అక్కడే గడుపుతున్నాడు. టామ్ తన బిడ్డకంటే ఎక్కువని, మరువలేకపోతున్నానని ముత్తు తెలిపారు.