kotha paluku | ‘ఆ రెండు పత్రికలు చదవకండి..’ ఇది ఒకప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాట. ఇప్పుడదే మాట అనే పరిస్థితి! ‘ ఆంధ్రజ్యోతి ( andhrajyothy ) ’ రాధాకృష్ణ ( vemuri radhakrishna ) తెలంగాణపై, తెలంగాణ సమాజంపై, టీఆర్ఎస్ పార్టీపై నిరంతరం విషంకక్కుతూనే ఉన్నారు. ఏమన్న అంటే నేను తెలంగాణ వాడినే అని దబాయిస్తారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాం అంటారు. నిజామాబాద్ ప్రాంతవాసి అయివుండవచ్చు గానీ ఆయనలో తెలంగాణ ఆత్మ మచ్చుకైనా లేదు.
ఆయన హృదయావిష్కరణ ఇదిగో… ఆయన ‘కొత్తపలుకు’ ఏపీ బీపీ.. బూతురోత!’ (ఆదివారం,24అక్టోబర్)లో అక్కసుతో చేసిన వ్యాఖ్యానం..
‘ఆంధ్రప్రదేశ్ ఎంత నాశనమైతే తెలంగాణ అంత బాగుపడుతుందని నమ్ముతున్న కేసీఆర్ అండ్కో జగన్రెడ్డి దీర్ఘకాలం అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు..’ ఎంత దుర్మార్గం ఈ ఆరోపణ? ఆయన తాజా ‘ కొత్త పలుకు ( Kotha paluku ) ’ (ఆదివారం, 7 నవంబర్)లో విషం చిమ్మడం తారాస్థాయికి చేరింది. తన బాగుకోసం పక్కరాష్ట్రం నాశనమవ్వాలనే నైచ్యం లేదు తెలంగాణకు. ఈ గడ్డమీద ఉంటూ అట్లా రాయడానికి కొంచెం కూడా సిగ్గ నిపించలేదేమో! వెకిలితనమూ, భావ దారిద్య్ర మూ కలగలిపిన ఫలితమే రాధాకృష్ణ ‘కేసీఆర్ అండ్ కో’ పదప్రయోగం! ఇప్పుడు ‘ ఆంధ్రజ్యోతి ( andhrajyothy ) ’ ఒక మీడియా సంస్థ కాదు, వేమూరి అండ్ కో ప్రైవేట్ అఫైర్. మీడియా ముసుగులో ఉన్న అక్షరంపై దాడి చేస్తారా? అనే అర్హత ఇపుడు ఏమాత్రం ఉండదు.
మీది వార్తాపత్రికా లేక రాజకీయ పార్టీనా? మొన్న బద్వేలులో ఉపఎన్నికనే జరగనట్టు తూతూమంత్రం రిపోర్ట్ చేసిన మీ పత్రిక.. హుజూరాబాద్ ( Huzurabad ) ఫలితానికి మాత్రం రెండు పేజీలు కేటాయించి, మీ అక్కసును, పైత్యాన్ని, దుగ్ధను వెళ్ళగక్కారు. తాజాగా మరో ‘చెత్త పలుకు’ వండివార్చారు. ఇదేమి నీతిబాహ్యత, ఇదేమి పత్రికాస్వేచ్చ?! అలాంటపుడు ‘కొన్ని పత్రికలను చదువొద్దు’ అని పిలుపిచ్చినా, సమాజమే బహిష్కరించినా తప్పు ఎట్లా అవుతుంది?
తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘా లు, న్యాయస్థానాలు, వ్యక్తులు, సంస్థలు, ఆంగ్ల దినపత్రికలు తెలంగాణ ప్రజల జీవితాలపై ప్రభావం చూపే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాయి. అది అవసరం కూడా. కేసీఆర్ గానీ, ఆయన మంత్రివర్గం గానీ విమర్శలు చేయొద్దని అనడం లేదు. కానీ దుష్ప్రచారం చేయటమే పనిగా రాధాకృష్ణ చేస్తూ ఉంటే తెలంగాణ సమాజం ఎందుకు హర్షిస్తుంది? స్వంత అజెండాలతో సమాజాన్ని కబ్జా చేస్తానంటే ఊరుకోవడం తెలంగాణ అస్తిత్వానికే సవాల్ కాదా?
తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకు పోతూవుంటే పట్టదుగానీ దుమ్మెత్తి పోయడానికి మాత్రం ఎక్కడలేని ఉత్సాహం. ఏమి తెరవెనక లెక్కలో గానీ పేజీలకు పేజీలు కేటాయిస్తూ వుంటారు. తెలంగాణ వికాసం మాత్రం పట్టదు!
తాజాగా బెంగళూరుకు చెందిన ‘పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్’ నివేదిక తెలంగాణ అభివృద్ధిని, సుపరిపాలనను కండ్లకు కట్టింది. కేరళ, కర్ణాటక, తమిళనాడును వెనక్కినెట్టి, గతఏడాది 4వ ర్యాంకులోఉన్న తెలంగాణ నేడు టాప్ రేటెడ్గా ఉన్నది. సమర్థపాలనలో దేశంలోనే మూడోస్థానం, సమానత్వ సూచీలోనూ గణనీయ వృద్ధి నమోదు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లు.. ఏడున్నరేండ్లలోనే ఇప్పుడు రూ.9.80లక్షలకోట్లు. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం సుమారు రూ.95 వేలుంటే.. ఇప్పుడు రూ.2.37లక్షలు. స్వల్పకాలంలోనే అన్నిరాష్ర్టాలను దాటుకొని.. తారాజువ్వలా రాష్ట్ర ఆర్థికవృద్ధి దూసుకుపోతున్నది. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవేవీ పట్టని ఆంధ్రామూలాలున్న మీడియా తెలంగాణ సమగ్ర వికాసానికి ఏరకంగా పనికివస్తుంది?
హుజూరాబాద్ ఎన్నిక గురించి ఊహాగానాల ఇంగ్రేడియెంట్స్ కలిపి అసత్యాలు, అర్ధసత్యాలు వండి వారుస్తున్న రాధాకృష్ణ అసలు తెలుగునాట ఎన్నికల్లో ధనప్రభావ ఆదిపురుషుడు ఎవరో మన నం చేసుకోవాలి. అట్లాగే, తాను అంటకాగే నేడు దేశమంతా ఎలాంటి రాజకీయ మోడల్ను బీజేపీ నడిపిస్తున్నదో తెలియనట్టు నటించరాదు. ఆ తానులో ముక్క అయిన ఈటల గెలుపు ఏధర్మశాస్త్ర బద్ధమో ఆర్కే వివేచించుకోవాలి.
‘కేసీఆర్ తనతో నడచినవారిని పక్కనపెట్టిన్రు’ అని నిందిస్తూనే.. ప్రభుత్వంలో పాత్ర పోషిస్తున్న ఉద్యమకారులు, కవులు, కళాకారుల గురించి మాత్రం ‘వారిని పదవుల ఎరచూపి నోరుమూయించా రు’ అంటున్నారు ఆర్కే. ఇప్పుడు కేసీఆర్ మాత్రమేకాదు, ఆర్కే మిత్రుడైన చంద్రబాబుకానీ, నిత్యం పల్లకీమోసే మోదీ కానీ ఏమిచేయాలి? డే ఇన్, డే అవుట్ ఆర్కే సలహాలు తీసుకుని ప్రభుత్వం నడపాలి. అప్పుడు ఆర్కే సంతోషిస్తారు! ఇదీ ఆయన అసలు అజెండా.
కేసీఆర్కు వ్యతిరేకంగాఎవరెవరు జట్టుకట్టాలో కూడా ఆర్కే సూచించారు తాజాగా. కాంగ్రెస్, బీఎస్పీ, షర్మిల పార్టీ కలిసి పోవాలని కోరుకుంటున్నరు. షర్మిలను కలుపుకొనే కాడికి తెలంగాణ అవసరమా? ‘చంద్రబాబు పదవి ఇచ్చివుంటే కేసీఆర్ అక్కడే సర్దుకునే వారు, రాష్ట్రం వచ్చివుండేదికాదు’ అన్న ధోరణిలో మాట్లాడిన ఆర్కేకు ఏం తెలుసు తెలంగాణ అస్తిత్వం? ఈయన మాటలు నమ్మి జట్టుకట్టే కూటమి ఏదన్నా వుంటే గింటే మరోసారి శంకరగిరి మాన్యాలు వెతుక్కోవడమే! అస్తిత్వం అన్నా, ఉద్యమాలు అన్నా అంత చిన్నచూపు ఉన్న ఒక వెకిలి పెట్టుబడిదారుడా నీతులు చెప్పేది!
తమ కులాలకు, ప్రాంతాలకు, తాము వెన్నుగాచే పార్టీలకు ప్రయోజనం కలిగించేలా మీడియా ప్రయత్నించడం, ముఖ్యంగా ఆంధ్రామీడియా ఇందులో తెంపరితనం చూపించడం తెలంగాణపై దాడిగానే చూడాలి. ప్రజలే చరిత్ర నిర్మాతలు అనేది మన ఎరుకలోనిదే. చరిత్ర మాత్రమే కాదు, నిన్నటి పునాదిపై రేపటి భవిష్యతు ్తనిర్మితమయ్యే నేటి వర్తమానంలో కూడా ప్రజాసమూహానిదే పెద్దపీట!
మన ప్రజాస్వామ్య సౌధానికి శాసన వ్యవస్థ, కార్యనిర్వాహకవ్యవస్థ, న్యాయవ్యవస్థ మూడు ప్రధానమూల స్తంభాలు. ఫోర్త్ ఎస్టేట్గా పిలుచుకునే మీడియాది కూడా ప్రధానమైన భూమికే. నిజానికి ఈ అన్నివ్యవస్థలను నడిపించే స్టేక్ హోల్డర్స్ అయిన ప్రజలది అతిముఖ్యమైన భూమిక. వారిని నేను ఫిఫ్త్ ఎస్టేట్ అంటాను. ప్రజలు తమ ప్రభుత్వాలను తాము ఎన్నుకుంటారు. ఎన్నిలోపాలున్నా మనమం తా కలిసిచేసుకున్న ఒప్పందం ఎన్నికల ప్రక్రియ. ఇందులో జరిగే పాపపుణ్యాలకు కొందరే బాధ్యులు. నిజాయితీగా మాట్లాడితే- ఎవరూ తప్పించుకోలేని, నెపాన్ని ఇతరులపై నెట్టడానికి ప్రయత్నించగూడని ఒప్పందం అది. ‘భారత ప్రజలమైన మేము మాకు మేము సమర్పించుకుంటున్న రాజ్యాంగం’ అని కాదూ మనమంతా ఒట్టేసుకున్నది!
దానవీరశూరకర్ణలోఎన్టీఆర్అన్నట్టు.. ఇంత దనుక నిదురపోవు చుంటిరా ఏమి? ఇపుడే లేచి అధర్మమధర్మమని ఆవులించు చుంటిరి. మర్మధర్మములతో, పక్షపాత బుద్దులతో, పాతక కర్మలతో మనుగడ సాగించు మీరు ఈ మహాసభ నందు మాటాడ అనర్హులు. మీ హితోప దేశం కట్టిపెట్టండి కూర్చోండి…. మీ ‘ఓపెన్ హర్ట్’ ఇంత దారుణంగా ఉంటుందా ఆర్కే?!మీరే మొన్న ఉటంకించిన అమాయకులుగా కనపడే తెలంగాణ ప్రజల చైతన్యం’ మిమ్మల్ని వేటాడుతది, జాగ్రత్త!
ఎన్నికల ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెరుపులు మెరిపించింది. పాలస్తీనా లోనూ, నేపాల్లోనూ పోరాటకా రుల్ని అధికారంలో నిలబెట్టింది. కశ్మీర్లో ఆర్ఎస్ఎస్ తో పాటు ఇస్లాం రాడికల్స్ ఉన్న మహబూబాముఫ్తీ పొత్తుతో ప్రభుత్వాన్ని నడిపించారు. ప్రజల తీర్పుకున్న ఉదాత్తత అది. ఇలాంటి ప్రక్రియలో అవినీతి చేరడం, ప్రలోభాలు ప్రజలను నడిపించడం – ఇపుడు మనం కొత్తగా చూస్తున్నది కాదు. తప్పంతా ఒక రాష్ర్టానిది, ఒక పార్టీ, పాలకునిదని దుమ్మెత్తి పోయడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యం.
అవినీతి నేడు దేశవ్యాప్త సమస్య. అవినీతిని ధనసంబంధమైన అంశంగా మాత్రమే చూడకూడదు. అవినీతి అంటే కేవలం అక్రమార్జన కాదు. అవినీతి అంటే నీతి రహితమూ, విలువలు లేక పోవడమూ గా మనం చూడగలిగితే సమస్య లోతు అర్థమవుతుంది. ఎంతటి ఉత్పాతంలో ఉన్నామో అర్థమవుతుంది. విలువలు అనేవి మనిషి బౌద్ధిక జీవనపు అంతస్సూత్రం. అవి ఎలాంటి విలువలు అనేది ఆ మనిషి, అతడు ప్రాతినిధ్యం వహించే సమాజపు గతినీ స్థితినీ ప్రకటిస్తుంది.
వ్యవస్థల పరిపుష్టికోసం అందరం కృషి చేయాలి. మీడియా, ప్రజల పాత్ర మరీ ఎక్కువగా ఉండాలి. ఆ దిశగా జరిగే నిర్మాణాత్మక చర్చల్లో స్టేక్ హోల్డర్స్ అందరూ భాగస్వాములు కావాలి.
ముగించే ముందు.. మరోసారి తెలంగాణ విలువలు చెప్తా వినండి.. ఆర్కేగారూ మీరు ఎంత రెచ్చగొట్టినా తెలంగాణ ప్రజలు మీ మీద దాడి చేయరు. జగన్రెడ్డి కూడా ‘మన ప్రజలు హైదరాబాద్లో ఉన్నారు, వారికేమైనా అపాయం జరుగుతుందేమో అని ఆగుతున్నా’ అన్నారు. కానీ.. సీమాంధ్ర ప్రజలకు మీకంటే, జగన్రెడ్డి కంటే బాగా తెలుసు కాబట్టే.. ‘ఆంధ్రాలో కంటే మేం హైదరాబాద్లోనే బాగున్నాం’ అంటున్నారు.
అంతేకాదు.. ‘తెలంగాణ రాష్ట్రం వస్తే మనం వీసా తీసుకొని పోవాల్సి వస్తది’ అని దుష్ప్రచారాలు చేసిన కుటుంబంలోని వారు ఈ గడ్డమీద కొత్తగా పార్టీ పెట్టి వెకిలి రాజకీయం చేస్తూ ఉంటే, మీరు వారిని నెత్తికి ఎత్తుకుంటూ ఉంటే ప్రజాస్వామికంగానే ఎదుర్కోవాలని భావిస్తున్న తెలంగాణ విలువలు మీకు ఎప్పటికీ అర్థం కావు.
అయితే.. విమర్శ ప్రతివిమర్శలు తెలంగాణ బాగు కోరేవారు చేయాలి. బయటిశక్తులు కాదు! రాజకీయంలోనూ, మీడియాలోనూ విచ్ఛిన్నకర తెలంగాణేతర శక్తులు చొరబడుతున్నై…తెలంగాణ బిడ్డలూ, బహుపరాక్!
శ్రీశైల్రెడ్డి పంజుగుల
90309 97371
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR | ఫౌంహౌస్లో అడుగు పెట్టు.. ఆరు ముక్కలైతవ్
cm kcr | బండి నువ్వు తోకగానివి.. నా ఫాంహౌజ్ దున్నుతవా.. ట్రాక్టర్ డ్రైవర్వా?: సీఎం కేసీఆర్ ఫైర్
CM KCR | పర్యాటకం విషయంలో సింగపూర్ను చూసి సిగ్గుతో చచ్చిపోవాలి: కేసీఆర్
CM KCR | మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?: నిలదీసిన కేసీఆర్