హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో మసీదు నిర్మాణానికి గురువారం ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. జామియా నిజామియా వర్సిటీ చాన్స్లర్ మౌలానా ముఫ్తీ ఖలీల్ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని సంబంధిత అధికారులు తెలిపారు.