రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా మెగాస్టార్ మాత్రం అవసరమైన సందర్భాల్లో ముందుంటున్నారు. అటు సినీ పరిశ్రమ విషయంలోనే కాదు ఇటు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఖచ్చితంగా తన నిర్ణయాన్ని తెలుపుతున్నారు. అలా ఇప్పుడు ప్రధాని మోదీకి సమయం చూసి చురకలంటించారు చిరంజీవి.
నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగులతో పాటు ఆంధ్రప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కేంద్రం దిగిరాలేదు. నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో సెకండ్ వేవ్ తీవ్రత పెరగడం, ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధుల్లోకి దిగారు. కేంద్ర ఆదేశాలతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారీని ప్రారంభించారు. రోజుకి 100టన్నుల ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తూ దేశం నలుమూలలకు సరఫరా చేస్తున్నారు.
ఆక్సిజన్ రైలు విశాఖ చేరుకోవడంపై చిరంజీవి స్పందిస్తూ ప్రధానికి సోషల్ మీడియా వేదికగా లేఖ రాశారు. మీరు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు చేతుల్లో పెట్టి ఉంటే ఇంతమంది ప్రాణాలను ఎలా కాపాడుకోగలిగేవాళ్లమని ప్రశ్నించారు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి..నిర్ణయాన్ని మార్చుకోమంటూ ప్రధానిని కోరారు.
Let us THINK.. #VizagSteelPlant #OxygenForIndia pic.twitter.com/6MjSKp7jVB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 22, 2021