చేర్యాల, కొమురవెల్లి, ధూళిమిట్ట, మద్దూరులో కాళేశ్వర సవ్వడి
సిద్దిపేట, హుస్నాబాద్ నియోజకవర్గాలకు తీరనున్న నీటికొరత
సిద్దిపేట, మార్చి 05 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇన్నాళ్లూ నీళ్లకోసం కనాకష్టం పడ్డ కరువునేలను ఇక వద్దన్నా గోదారి కరువుతీరా తడుపనున్నది. బహుళ ప్రయోజనాలు కలిగిన కొమురవెల్లి మల్లన్నసాగర్ ద్వారా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ మరో రెండు నెలల్లో పూర్తయితే.. ఇక్కడి నుంచి గంధమల్ల, బస్వాపూర్, నిజాంసాగర్, సింగూరు, తపాస్పల్లి, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు కూడా ఇక్కడినుంచే గోదావరి జలాలను తరలించేలా ప్రణాళికలు సిద్ధంచేశారు.
తపాస్పల్లి రిజర్వాయర్కు కాళేశ్వర జలాలు చేరితే.. ఇప్పటిదాకా కరువుప్రాంతాలుగా ఉన్న చేర్యాల కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు గోదావరి జలాలతో తడిసిముద్దవుతాయి. మల్లన్నసాగర్ నుంచి ఒకవైపు గేట్లు ఎత్తితే కొండపోచమ్మ, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు నీరు చేరుతుంది. మరో గేటు ఎత్తితే సింగూరు ప్రాజెక్టుకు నీళ్లు అందుతాయి. ఇంకో గేటు ఎత్తితే నిజాంసాగర్కు.. మరో గేట్ ఎత్తితే మిషన్ భగీరథ ప్రాజెక్టుకు జలాలు తరలివెళ్తాయి.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఆలోచన చేయడంతో సిద్దిపేట జిల్లా నలుమూలలకు గోదావరి జలాలు అందనున్నాయి. తపాస్పల్లి రిజర్వాయర్కు ప్రస్తుతం దేవాదుల నుంచి గోదావరి జలాలు వస్తున్నాయి. ఇక నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా విడుదల చేసేందుకు 0.75 కిలోమీటర్ బండ్ వద్ద ఓటీ స్లూయిజ్ను ఏర్పాటుచేస్తున్నారు. 0.3 సామర్థ్యంతో ఉన్న తపాస్పల్లికి నీళ్లు వెళ్తాయి. సిద్దిపేట, హుస్నాబాద్ నియోజకవర్గాలకు సైతం ఇక్కడి నుంచి నీళ్లు వెళ్లే అవకాశమున్నది.
పెద్దవాగులోకి గోదావరి జలాలను విడుదలచేస్తే మూడు నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. కమలాయపల్లి చెరువు నుంచి నంగునూరు చెరువు మీదుగా పెద్దవాగులోకి పంపిస్తే, ఘనపూర్ వద్ద కలుస్తాయి.ఇటు కమలాయపల్లి చెరువు నుంచి ధూళిమిట్ట, ఖాత ఘనపూర్, అక్కెనపల్లి, పోరెడ్డిపల్లి, బస్వాపూర్, శనిగరం చెరువులోకి తీసుకెళ్లే అవకాశాలు సైతం ఉన్నాయి.
మరిన్ని వార్తలు చదవండి..
ఒక్క గ్రామానికి ఏడాదికి 3.37 కోట్లు
మల్లన్నసాగర్ నుంచే నిజాంసాగర్కు