హైదరాబాద్ : కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చేది బాయిల్డ్ రైసేనని, బాయిల్ చేయకుంటే వచ్చేది 50శాతమేనన్నారు. ఈ ఉల్టా పల్టా మాట్లాడి మేం బియ్యం కొనమన్నమా? అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతున్నడు. ఒక రాష్ట్రానికి కేంద్ర మంత్రి ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడుతరు.
ఎందుకు కొనరు, మా రాష్ట్రంలో అట్లనే పండుతది.. యాసంగిలో మాకు బాయిల్డ్ రైసే వస్తది తీసుకోవాలని చెబితే సిపాయి కిషన్రెడ్డి. ఎట్లా అయినా నేను కొనిపిస్తే అంటే సిపాయి కిషన్రెడ్డి. కొనమని చెప్పే కేంద్రమంత్రి కావాలన్న తెలంగాణకు. చాతకాని దద్దమ్మ. ఐయామ్ వెరీ సారీ. ఆయన ఏం మాట్లాడుతున్నడు. ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నడు. మీకు దమ్ముంటే ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నవో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనిపియ్యాలే. బాయిల్డ్ రైస్సే తెలంగాణ నుంచి వస్తది. 35 డిగ్రీల్లో ఎండల్లో మా పండుతది మా పంట.. కొనండి చెప్పు. మీ చేతగాని తనాన్ని మంది మీద రుద్దుతరా?. మీది రైతు హంతక ప్రభుత్వం. దిక్కుమాలిన చట్టాలు తెచ్చారు. మీ ప్రధానే ఇవాళ క్షమాపణలు చెప్పారు భారత దేశ రైతాంగానికి. 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న హంతకుల పార్టీ మీది..మీరు మాట్లాడుతారా? మీది రైతు రాబంధుల పార్టీ.
750 రైతులు చనిపోయింది నిజం కాదా.. 13 నెలల పాటు కరోనాలో, ఎండ, వానాలో చస్తే ఆందోళన జీవులని అవమానపరిచారు. కొట్టి సంపుమని హర్యానా సీఎంకు చెప్పి.. కార్లెక్కించి తొక్కించి సంపి చివరకు క్షమాపణలు చెప్పి.. చివరకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు. మేం రైతుబంధువులం. నాశనమైన చెరువులను బాగు చేయలే కనపడుతలేవా? దా.. ఏ వూరికి వస్తవో.. ప్రాజెక్టులు మేం కట్టలేదా? ఆయకట్టు స్థిరీకరణ కాలేదా?. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదా? ఎవరు పూర్తి చేశారు? ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టు, నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్సాగర్, దేవాదుల ప్రాజెక్టు ఎవరు పూర్తి చేశారని ప్రశ్నించారు.