హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తనను చంపుతామని బెదిరిస్తూ సోషల్ మీడియా ద్వారా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టులు పెడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారని దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
దుండగుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని, బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె సైబర్క్రైమ్స్ డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేశారు. లేపేస్తామనే అర్థం వచ్చేలా దుండగులు ఫేస్బుక్లో పోస్టులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్టు బా ధితురాలు పేర్కొన్నారు. బెదిరింపు పో స్టులపై కేసు నమోదు చేసి, దర్యాప్తులో దుండగులను గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటామని డీసీపీ పేర్కొన్నారు.