హైదరాబాద్ : హైదరాబాద్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. షర్మిల స్పందించారు. ఏపీలో పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు అని షర్మిల స్పష్టం చేశారు. మేం ఒక మార్గాన్ని ఎంచుకున్నామని, ఆ విధంగానే ముందుకెళ్తున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
అయితే గత కొద్ది రోజుల నుంచి వైఎస్ జగన్కు, షర్మిలకు పడటం లేదని, వీరిద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయని మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకల్లోనూ అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు తలెత్తినట్లు వార్తలు షికారు చేశాయి.