YS Sharmila | పోలీసులపై దాడి కేసులో అరెస్టయిన వైఎస్సార్టీపీ నాయకులు వైఎస్ షర్మిల చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రూ.30వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీల తరఫు న్యాయవాదులు సమర్పించారు. ఆ తర్వాత విడుదలకు సంబంధించిన ఆర్డర్లతో న్యాయవాదులు చంచల్గూడ జైలు అధికారులకు సమర్పించగా.. విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు షర్మిలకు అడ్డుకునేందుకు వెళ్తుండగా అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆమె ఓ ఎస్ఐ స్థాయి అధికారిపై చేయిచేసుకోవడంతో పాటు మహిళా కానిస్టేబుల్ను నెట్టివేశారు. దాంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా మే 8 వరకు కోర్టు రిమాండ్ విధించగా.. పోలీసులు ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. మరో వైపు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన కోర్టు షరతులతో బెయిల్ను మంజూరు చేసింది. అయితే, విదేశాలకు వెళ్లే ముందు కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.