YS Sharmila | ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన కొడుకు వివాహానికి రావాలని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. షర్మిల బుధవారం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి నిశ్చితార్థం, పెళ్లి ఆహ్వానపత్రిక అందజేశారు. షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో జరుగనున్నది. ఈ నెల 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరుగనున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆమె రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ వివాహ ఆహ్వానపత్రికలను అందజేస్తున్నారు. తొలికార్డు తండ్రి సమాధి వద్ద పెట్టిన ఆ తర్వాత రెండో కార్డు తన సోదరుడు, ఏపీ సీఎం జగన్కు ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు, ప్రముఖులకు షర్మిల ఆహ్వానపత్రికలు అందజేశారు.