హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు, కడప ఎంపీ అవినాశ్రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. బీపీ పెరగడంతో ఉస్మానియా దవాఖానకు తరలించి, చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు.
వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్రెడ్డిని శనివారం నిమ్స్కు తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా, అవినాశ్రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ దవాఖానకు తీసుకొచ్చారు. అవినాశ్రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు.