నల్లగొండ : అమరుల స్ఫూర్తితో యువత తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను సాధించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా సందర్భంగా వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు.
గత ఎనిమిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని గుర్తు చేశారు.
కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మున్సిపల్ కమిషనర్ రమణ చారి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాం రెడ్డి పాల్గొన్నారు.