హైదరాబాద్ : జర్నలిజం ముసుగులో అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణకు నిరసనల సెగ తగులుతున్నది. సొంత మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టారీతిగా తప్పుడు ప్రచారం చేస్తుండటం పట్ల పలువురు యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ఎన్నికలో కుక్కను నిలబెట్టినా గెలుస్తామని అన్నారంటూ ఏబీఎన్ ఆంధ్యజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. కొందరు యువకులు ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి కార్యాలయం వద్ద నోటికి నల్లగుడ్డలు, ప్లకార్డులతో మౌనదీక్ష చేపట్టారు. కేటీఆర్ ఆ వ్యాఖ్యలు ఎక్కడన్నారో నిరూపించాలని, లేని పక్షాన భేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేసారు.
భార్యను మోసం చేసిన కేసులో భర్త అరెస్ట్..విచారణలో విస్తుగొలిపే విషయాలు
Leopard attack | చిరుత దాడిలో ఆవు మృతి