హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లోని హబీబ్నగర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి షాదాబ్ అనే యువకుడిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుడు మంగళ్హాట్ చెందిన వాడని, ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడని తెలిపారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామన్నారు.