నిర్మల్: ప్రేమ వ్యవహారం ఓ యువకుని ప్రాణాన్ని బలితీసుకున్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శి నగర్లో ఈ ఘోరం జరిగింది. ప్రియదర్శి నగర్లో ప్రేమ వ్యవహరానికి సంబంధించి ఇద్దరు యువకుల మధ్య గొడవ మొదలైంది. క్రమంగా అది ఘర్షణకు దారితీయడంతో ప్రసాద్ అనే యువకుడిని మరో వ్యక్తి కత్తితో పొడిచాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు లోకేశ్వరం మండలం గడ్చందాకు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.