మాదాపూర్, ఆగస్టు 17: ద్విచక్ర వాహనాన్ని నిర్లక్ష్యంగా వాయువేగంతో నడపడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసింది. ఓ యువకుడు ైప్లె ఓవర్పై స్కూటీని వేగంగా పోనిచ్చి యువతి బలిగొన్నాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోయర్ ట్యాంక్బండ్లో నివాసం ఉంటున్న స్వీటీ పాండే(22) ఓ ప్రైవేట్ ఉద్యోగి. గురువారం సాయంత్రం వెస్ట్ బెంగాల్లోని కోల్కతాకు చెందిన స్నేహితుడు రాయన్ ల్యూకెతో కలిసి స్కూటీపై జేఎన్టీటీయూ కూకట్పల్లి నుంచి బయలుదేరింది. యువకుడు ఐకియా వైపు వెళ్తూ వాహనాన్ని వేగంగా నడిపాడు.
హైటెక్ సిటీ చౌరస్తా వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి ప్రొటెక్షన్ వాల్ను ఢీకొన్నది. రాయల్ ల్యూకె కిందపడ గా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెనకాల కూర్చున్న స్వీటీ పాండే ైప్లెఓవర్ పైనుంచి కింద ఉన్న రోడ్డుపై పడగా తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా స మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇద్దరిని సమీప దవాఖానకు తరలించారు. స్వీటీ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.