కాన్పూర్: ఉన్నత చదువుకన్నా తన కిడ్నీ ఎక్కువ కాదని భావించిన కాన్పూర్లోని ఒక యువకుడు ఎంబీఏ చదవడానికి ఏకంగా తన కిడ్నీనే అమ్ముకున్నాడు. అయితే ‘వ్రతం చెడింది.. ఫలితం దక్కలేదు’ అన్నట్టు అయ్యింది అతడి పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. బీహార్కు చెందిన ఆయుష్ ఎంబీఏ చదవాలనుకున్నాడు. అయితే అవసరమైన డబ్బు లేకపోవడంతో కిడ్నీ అమ్మి అయినా ఉన్నత చదువును చదవాలనుకున్నాడు. దీంతో ఒక గ్యాంగ్ను సంప్రదించగా, కిడ్నీ ఇస్తే రూ. 80 లక్షలు ఇస్తామని వారు ఆశచూపారు. అతడిని కాన్పూర్లోని ఒక దవాఖానకు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్ చేసి తీయించి వేరే మహిళకు మంచి ధరకు అమ్మి, ఆరు లక్షలు అతని చేతిలో పెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కిడ్నీ రాకెట్ ఢిల్లీ, ముంబై, లక్నోలతో పాటు నేపాల్, దక్షిణాఫ్రికాకు కూడా విస్తరించిన విషయాన్ని గుర్తించారు.