మంథని, జూన్ 18: పెండ్లి కావడంలేదని మనస్తాపంతో ఓ యువకు డు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథని చెందిన దాసరి లక్ష్మి, వెంకటి దంపతుల మూడో కుమారుడు సంతోష్ (28) ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఇటీవలే తమ్ముడికి వివాహ మైంది. తనకు పెండ్లి కాకపోవడంతో మనోవేదనతో మద్యానికి బానిసయ్యాడు.
ఈ క్రమంలో ఈ నెల 16న మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగాడు. ఈ విషయాన్ని అతడి స్నే హితుడు వినోద్.. సంతోష్ సోదరుడు రాజేశ్, తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. సంతోష్ ఆచూకీ కోసం గాలిస్తుండగా శివారులోని నందికట్ట వద్ద అచేతనస్థితిలో కనిపించాడు. చికిత్స నిమిత్తం మంథని, అక్కడి నుంచి కరీంనగర్ దవాఖానకు తరలించారు. ఆదివారం పరిస్థితి విషమించి మరణించాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.