హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై గడ్డపారతో గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే యువకుడు మృతి చెందారు. మృతుడిని నాగరాజుగా గుర్తించారు. వేరే సామాజిక వర్గానికి చెందిన యువతిని ఇటీవల ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే జంట ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద గడ్డపారతో గుర్తు తెలియని వ్యక్తి నాగరాజుపై దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.