Akarshana Satish | హైదరాబాద్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఆకర్షణ సతీష్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం మన్కీబాత్లో ప్రధాని మాట్లాడుతూ.. లైబ్రరీలో ఏర్పాటులో ఆకర్షణ కృషిని అభినందించారు.
ఆకర్షణ సొంతంగా ఏడు లైబ్రరీలను స్థాపించారు. వీటిలో 5 హైదరాబాద్లో, 2 తమిళనాడులో ఏర్పాటుచేశారు. ఇరుగుపొరుగు వారు, సహ విద్యార్థులు, కుటుంబ సభ్యుల నుంచి లైబ్రరీకి పుస్తకాలను సేకరించింది. ఇప్పటివరకు సుమారు 5800 పుస్తకాలను సమీకరించింది.