కరీంనగర్ జిల్లాలో..
రామడుగు, గంగాధర, వెన్కేపల్లి-సైదాపూర్, వీణవంక
పెద్దపల్లి జిల్లాలో..
ధర్మారం, కాల్వశ్రీరాంపూర్, మొట్లపల్లి, ఆశన్నపల్లె, మంగపేట, మంథని, రామగిరి
జగిత్యాల జిల్లాలో..
ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, సిరిపూర్, చిట్టాపూర్, ముత్యంపేట, గొల్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, గంభీరావుపేట, కోనరావుపేట
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జైనూర్, కాగజ్నగర్
మంచిర్యాల జిల్లాలో..
చెన్నూర్, కిష్టంపేట, బెల్లంపల్లి
ఆదిలాబాద్ జిల్లాలో..
తాంసి, బోథ్, నేరడిగొండ మండలం కిష్టాపూర్, ఉట్నూర్
గోయల్కు తెలంగాణ నూకలు కొరియర్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్వై నేతలు వినూత్న నిరసన తెలిపారు. టీఆర్ఎస్వై జిల్లా నేత సిలువేరి చిరంజీవి ఆధ్వర్యంలో సోమవారం నూకలను కొరియర్ ద్వారా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు పంపించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు నూకలు తినడం అలవాటు చేసుకోవాలని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.