వరంగల్ సబర్బన్, మే 19/కమలాపూర్: అవినీతి బండారం బయటపడి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్కు ‘ఆత్మాభిమానం’ మాటను వాడే అర్హత లేదని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల టీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. బుధవారం కమలాపూర్లో వారు విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో వైస్చైర్మన్ ఎర్రం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు బీసీలకు రిజర్వ్ అయితే ముదిరాజ్లకు అవకాశం ఇవ్వాలంటే ‘మా కులంలో గంతటోళ్లు ఎవరున్నారు’ అని కించపరిచిన చరిత్ర ఆయనదని మండిపడ్డారు.