హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఆనందమైన జీవితం, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన దివ్యఔషధమని సింగరేణి జీఎం (కో ఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణిభవన్లో యోగా ఉత్సవ్ కౌంట్డౌన్-67ను ఆయన ప్రారంభించారు.
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల్లో 67 రోజుల పాటు సామూహిక యోగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సూర్యనారాయణ తెలిపారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఈ శిక్షణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు.